PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ రాజీనామా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి మంగళవారంనాడు రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను పార్లమెంటు కాంప్లెక్స్‌లో కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అజాంగఢ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఇటీవల యూపీలోని కర్హాల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కూడా అఖిలేష్ గెలుపొందడంతో ఆ సీటును ఉంచుకుని, లోక్‌సభ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు.

                                  

About Author