PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ హెలీకాప్ట‌ర్ కొనుగోలు చేసిన తొలి ఇండియ‌న్ ఇత‌డే.. ధ‌ర ఎంతో తెలుసా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్‌పీ గ్రూప్‌ కంపెనీస్‌ చైర్మన్‌ బీ రవి పిళ్లై భార‌తీయ ధ‌న‌వంతుల్లో ఒక‌రు. ఇటీవ‌ల ఆయ‌న రూ.100 కోట్ల విలువైన హెలీకాప్టర్‌ ‘ఎయిర్‌బస్‌ హెచ్‌145’ని కొనుగోలు చేశారు. ఈ విలాస హెలీకాప్టర్‌ను కొనుగోలు చేసిన తొలి భారత వ్యక్తి ఆయనే. ఈనెల 20న ఎయిర్‌బస్‌ రవి పిళ్లైకి హెలీకాప్టర్‌ను అందించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఈ మోడల్‌ హెలీకాప్టర్లు 1500 మాత్రమే ఉన్నాయి. ఏడుగురు ప్రయాణికులతోపాటు ఇద్దరు పైలెట్లు కూర్చునేందుకు వీలుండే ఈ హెలీకాప్టర్‌.. సముద్రతీరానికి 20,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలోనూ ల్యాండ్‌ కావడంతోపాటు టేకాఫ్‌ కాగలదని ఎయిర్‌బస్‌ అంటోంది.

                              

About Author