PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్ల‌మెంట్ లో మ‌హిళా ఎంపీ క‌న్నీరు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో ఈ నెల 22న 8మంది మహిళలు, చిన్నారులు సజీవదహనమైన ఘటనను తలచుకుని బీజేపీ ఎంపీ రూప గంగూలీ పార్లమెంటులో కన్నీరు పెట్టారు. రాష్ట్రం ఏ మాత్రం నివాసయోగ్యంగా లేదని, వెంటనే రాష్ట్రపతి పాలనను విధించాలని ఆమె డిమాండ్‌ చేశారు. స్వయంగా రాష్ట్ర సర్కారే హంతకులకు రక్షణ కల్పిస్తోందని రూప ఆరోపించారు. కాగా.. బిర్భూమ్‌ సజీవదహనాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తునకు బెంగాల్‌ సర్కారు పూర్తి సహకారం అందించాలని సూచించింది.

                                             

About Author