PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కొలువుల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వ‌ర్గాలు వెల్లడించాయి. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ విపక్షాలు ఇదే అంశాన్ని ఎత్తిచూపడంతో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లోపు ఖాళీలను భర్తీ చేయడం ద్వారా వ్యతిరేకత తగ్గుతుందనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించినా.. కొన్ని శాఖల్లో నియామకాలు పూర్తయ్యే సరికి రెండేళ్లు పట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే నిరుద్యోగులకు తీపి కబురు చెప్పేందుకు ఆయా శాఖలు కసరత్తు ప్రారంభించాయి.

                                

About Author