PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందువులు లేని దేశంగా మార‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : య‌తి న‌ర‌సింఘానంద మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రానున్న దశాబ్దాల్లో మన దేశం హిందూ రహితంగా మారకుండా జాగ్రత్తవహించాలని ఘజియాబాద్ దస్నా దేవాలయం ప్రధాన అర్చకుడు యతి నరసింఘానంద హిందువులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని హిందువులను కోరారు. హరిద్వార్‌లో విద్వేష ప్రసంగం కేసులో ఆయన బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన గోవర్ధన్‌లో విలేకర్లతో మాట్లాడారు. 2029లో హైందవేతరుడు ప్రధాన మంత్రి అవుతారని గణాంకాలు చెప్తున్నాయన్నారు. హైందవేతరుడు ప్రధాన మంత్రి అయితే ఆ తర్వాత ఇరవయ్యేళ్ళలో మన దేశం హిందువులు లేని దేశం అవుతుందని చెప్పారు. హిందుత్వాన్ని మేలుకొలిపేందుకు ఆగస్టు 12 నుంచి 14 వరకు మధుర-గోవర్ధన్ ప్రాంతంలో ధర్మ సంసద్‌ను నిర్వహిస్తామని చెప్పారు.

                                  

About Author