PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేలిన ఎల‌క్ట్రిక్ బైక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల‌క్ట్రిక్ బైక్ పేలిన ఘ‌ట‌న ఏలూరు జ‌రిగింది. తంగెళ్లమూడి ప్రాంతం మామయ్యగారితోటలోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. ఎలక్ర్టీషియన్‌ అడ్డగర్ల మురళీకృష్ణ ఇక్కడి సాయి లీలా ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. ఆయన గతేడాది ఏప్రిల్‌ 9న ఏలూరు పవర్‌పేటలోని ఓ షాపులో తున్వాల్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుగోలు చేశారు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఆ బైక్‌కు మురళీకృష్ణ చార్జింగ్‌ పెట్టి పైకి వెళ్లారు. కొద్దిసేపటికే ఆ బైక్‌ పేలిపోయింది. దాని పక్కనే ఉన్న వివిధ కంపెనీల ఐదు మోటారు సైకిళ్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఓ కారు స్వలంగా దగ్ధమైంది.

                                         

About Author