PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ద‌ళితుల్ని హిందువుల్లో క‌లిపేస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దళితులను హిందువుల్లో కలిపేస్తున్నారని కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాల జాతీయ సమన్వయకర్త కె.రాజు అన్నారు. ఇటీవలే వెల్లడైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ తీరు ఆందోళనకరమని ఆయన చెప్పారు. దళిత సంస్థలన్నీ ఒక్కటై, బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని, వారి హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తమను ప్రత్యేక వర్గంగా చూస్తేనే తమ కలలు సాకారం అవుతాయన్న విషయాన్ని దళితులు గ్రహించాలని ఆయన కోరారు. ఈ విషయంలో వారికి అవగాహన వస్తే, ఎన్నికల ఫలితాలను వారు తారుమారు చేయగలరని వ్యాఖ్యానించారు. దళితులంతా కలిసికట్టుగా ఉంటేనే వారి కలలు నెరవేరతాయని అన్నారు. ‘‘దళితులను హిందువులుగా మార్చి వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు.

                               

About Author