PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేతిరెడ్డికి ప‌రిటాల వార్నింగ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లా ధర్మవరం టీడీపీ నేత పరిటాల శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుని తప్పని ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టండి అంటూ సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ప్రజల సమస్యలపై పోస్టింగ్ లు పెడితే కేసులు పెడతామంటే ఎలా ఊరుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం భయపడమని, సోషల్ మీడియాలో తాను కూడా పోస్టులు పెడతానని నా మీద ఎన్ని కేసులు పెడతారో, నన్ను కొడతారో చూద్దాం అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. ప్రజలతో ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉండాలంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి.. టీడీపీ నాయకులను గెలుక్కున్నవ్.. నిన్ను వదిలిపెట్టం అంటూ పరిటాల శ్రీరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేతిరెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు చేసే పనులు అంతాఇంతా కాదు, వాటన్నింటిని బయటపెడతాం. నువ్వు బెదిరించి లాక్కున్న భూములున్నాయి, నీ తమ్ముడు చేసే రియల్ ఎస్టే ట్ ఉంది. నీ తమ్ముడు చేసే పనికిమాలిన దందాలను బయటపడతాం, ప్రతి ఒక్కటి బయటపెడతా, ఏవీ వదిలేది లేదు అంటూ హెచ్చరించారు.

                              

About Author