PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌పంచంలో అత్యంత విలువైన కంపెనీ ఏదో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ స్థానాన్ని యాపిల్‌ కోల్పోయుంది. ఆ స్థానాన్ని ఇప్పుడు సౌదీ ఆరామ్కో చేజిక్కించుకుంది. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సౌదీ ఆరామ్కో 2.42 లక్షల కోట్ల డాలర్లతో మార్కెట్‌ విలువలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండగా యాపిల్‌ 2.37 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానానికి దిగజారింది. క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదల సౌదీ ఆరామ్కో ప్రథమ స్థానానికి చేరడానికి దోహదపడింది. ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్‌ మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్లు, సౌదీ ఆరామ్కో విలువ 1 ట్రిలియన్‌ డాలర్లుంది. ఈ నాలుగు నెలల కాలంలో యాపిల్‌ 20 శాతం విలువను నష్టపోగా సౌదీ ఆరామ్కో విలువ 28 శాతం పెరిగింది.

                                          

About Author