PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ 22 గదుల్లో ర‌హ‌స్యం ఉందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తాజ్‌మహల్‌లో తాళం వేసిన 22 భూగర్భ గృహాల్లో ఎలాంటి రహస్యం లేదని పురావస్తు శాఖ స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టు నిర్ణయానికి 6 రోజుల ముందే ఫోటోలు విడుదల చేయడం విశేషం. తాజ్‌మహల్‌ బేస్‌మెంట్‌లోని 22 గదుల తాళం తెరిచి అందరికీ అందుబాటులో ఉంచాలని కోరుతూ అయోధ్యలోని బీజేపీ నేత రజనీశ్‌ సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నెల 12న దీన్ని కోర్టు కొట్టివేసింది. దీనిపై పురావస్తు శాఖ అధికారులు స్పందిస్తూ ఈ గదుల్లో ఎలాంటి రహస్యాలు లేవని, ఇవి పెద్ద విశేషమైనవేమీ కాదని తెలిపారు.

                                       

About Author