PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో రాజ్య‌స‌భ‌కు అర్హులు లేరా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో రాజ్యసభకు అర్హులైనవారే లేరా అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లు రెండు తెలంగాణ, రెండు ఆంధ్రాకు ఇచ్చి సమ న్యాయం చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందులో కూడా ఇద్దరు తెలుగుదేశం మాజీలు, మరో ఇద్దరు ఆయనకు కావాల్సిన వాళ్లని టీడీపీ అధినేత చెప్పారు. ఆయనకు కావాల్సిన ఇద్దరిలో ఒకరు వివేకా హత్య కేసులో ప్రత్యేక లాయర్‌గా వ్యవహరించి ఆ కేసు మీద పోరాడిన వ్యక్తని.. అనుకూలంగా కాదని, వ్యతిరేకంగా అని.. అలాంటి వ్యక్తి అయిన నిరంజన్‌ రెడ్డిని జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

                        

About Author