PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నేత‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ నేత‌లు గడపగడపకు వెళ్తే రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ పాలనలో గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు. వైసీపీ నేతల బస్సు యాత్రకు పోలీసుల పహారా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు రాళ్లు వేస్తారు.. వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. త్వరలో మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్‌తో కలిసి వెంకటరమణస్వామి ఆలయానికి వస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు.

                                        

About Author