PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఫ్ తిన‌డం పై సిద్ద‌రామ‌య్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య గోమాంసంపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, ఇప్పటివరకు గోమాంసం తినలేదని.. కావాలంటే తాను బీఫ్ తింటానని అన్నారు. తుమకూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభకు హాజరైన సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని మాజీ సీఎం ఆరోపించారు.“నేను హిందువుని. నేను ఇప్పటివరకు గొడ్డు మాంసం తినలేదు, కానీ నాకు కావాలనుకుంటే, నేను తింటాను. నన్ను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు?’’అని తుమకూరులో జరిగిన కార్యక్రమంలో సిద్ధరామయ్య ప్రశ్నించారు.

                           

About Author