PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హ‌నుమాన్ జ‌న్మ‌స్థలం క‌ర్ణాట‌కే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంజనేయ స్వామి జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్‌లోని అంజనేరి కాదని.. కర్ణాటకలోని కిష్కింధ మాత్రమేనని కర్ణాటకకు చెందిన దేశ్ పాండే స్వామీజీ అంటున్నారు. దీనిపై నాసిక్‌లో గురువారం ధర్మసంసద్‌ సమావేశానికి ఆయన పిలుపిచ్చారు. అక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులు, సంత్‌ల అభిప్రాయాలు తీసుకుంటామని.. వారు తీసుకునే నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారని శ్రీమండలాచార్య పీఠాధీశ్వర్‌ మహంత్‌ స్వామి అనికేత్‌ శాస్త్రి దేశ్‌పాండే వెల్లడించారు. అంజనేరిలో ఆంజనేయుడు పుట్టాడని రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. కర్ణాటకకే చెందిన మహంత్‌ గోవింద్‌ దాస్‌ కూడా ఇదే ఉద్ఘాటించారు. జన్మస్థలం ఒక్కటే ఉంటుందని, అంజనేరిలో ఆంజనేయుడు పుట్టినట్లు వాల్మీకి రాయలేదని అన్నారు. కిష్కింధలోనే జన్మించాడని రాశాడని పేర్కొన్నారు.

                                

About Author