PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌శ్మీర్ పండిట్ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు పండిట్లే టార్గెట్‌గా మారణకాండకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా పండిట్లు చేస్తున్న ఆందోళనలకు దిగివచ్చి.. 177 మంది కశ్మీరీ పండిట్‌ టీచర్లను సురక్షిత ప్రాంతమైన జమ్మూకు బదిలీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోబాల్‌ కశ్మీ ర్‌ పరిస్థితులపై సమీక్ష జరిపిన మర్నాడే ఈ బదిలీలు జరగడం గమనార్హం. మిగతా ఉద్యోగులను కూడా విడతల వారీగా బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

                                

About Author