PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాడిప‌త్రి.. టీడీపీ కౌన్సిల్ మెంబ‌ర్ పై దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఐ కాలనీ సమీపంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి చెందిన ఎస్టీపీ-1లో జరుగుతున్న పైపులైన్‌ పనులను అడ్డుకున్నారు. అక్కడున్న టీడీపీ కౌన్సిల్‌ సభ్యులపై దాడికి దిగారు. ఈ దాడిలో 30వ వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జునకు గాయాలయ్యాయి. మల్లికార్జున పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.

                                            

About Author