PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెంకయ్య అభ్య‌ర్థి అయితే.. మ‌రొక‌రు సాహ‌సించ‌రు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎంతో మంది ఉపరాష్ట్రపతులను, రాష్ట్రపతిగా ఎన్నుకున్న సంప్రదాయం కొనసాగించాలన్నారు. వెంకయ్య నాయుడు రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి అని కొనియాడారు. వెంకయ్య నాయుడు పేరును ఎన్డీయే సిఫార్సు చేస్తే.. ఇతర పార్టీలు కూడా పోటీకి అభ్యర్థిని పెట్టేందుకు సాహసించవని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వచ్చి, అంశం వివాదం కావటం తగదని సోమిరెడ్డి అన్నారు.

                                        

About Author