PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ అధ్య‌క్ష రేసులో శ‌శి థ‌రూర్ ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో కేరళకు చెందిన ఎంపీ శశి థరూర్‌ ఉండనున్నారా? ప్రత్యక్షంగా వెల్లడించనప్పటికీ ఓ పత్రికలో రాసిన వ్యాసం ద్వారా ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి చాలా మంది ముందుకు వస్తారంటూ అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా తన మనసులోని మాటను చెప్పారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోటీ నుంచి దూ రంగా ఉండాలని గాంధీ కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అందువల్ల రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ పేరును వారు ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశి థరూర్‌ ప్రయత్నం ప్రాధాన్యం సంతరించుకొంది.

                                          

About Author