NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. :శ్రీనివాసులు రెడ్డి

1 min read

 పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అ వైసిపి నేత మడితాటి (కోడి) శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు..  అన్నమయ్య జిల్లా రాయచోటీ పట్టణం  మదన పల్లె రోడ్డు మార్గంలో యం యస్ ఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ దగ్గర  కుటుంబ సభ్యులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి  వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు  .అనంతరం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో  ప్రజలు పాల్గొన్నారు.అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ వినాయకుని కృపా కటాక్షలతో అష్ట ఐశ్వర్యాలు,అయూరారోగ్యాలు కలగాలని ఉత్సవ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.కార్యక్రమంలో తప్పేట్లా సుబ్బారెడ్డి,శేఖర్ రెడ్డి,సురేష్ రెడ్డి,రామలింగ రెడ్డి,శంకర్ రెడ్డి,రెడ్డయ్య,లేపాక్షి రెడ్డి,మణి రెడ్డి,మనోహర్ రెడ్డి,జంగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author