PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీమిండియా ఓట‌మి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ద‌క్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో… 250 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 8 వికెట్లకు 240 పరుగులు మాత్రమే చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ పోరాటం వృథా అయింది. శాంసన్ 63 బంతుల్లో 86 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. ఆఖర్లో 6 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి వచ్చింది. స్పిన్నర్ షంసీ ఆ ఓవర్ బౌలింగ్ చేయగా, సంజు శాంసన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు బాదినా ఫలితం దక్కలేదు. టీమిండియా… విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

                                           

About Author