PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుపేదలకు భరోసా.. సీఎం రిలీఫ్ ఫండ్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ నందికొట్కూరు:కష్ట కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న పేదలకు సీఎం రిఫండ్ పథకం ఓ వరం . ఆరోగ్యానికి భరోసా లాంటిదని ఎమ్మెల్యే తోగుర్ అర్థర్ అన్నారు. గురువారం పట్టణంలో స్థానిక వైస్సార్సీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద నలుగురికి మంజూరైన రూ, 4,25,000 చెక్కులను ఎమ్మెల్యే అర్థర్ బాధితులైన లబ్ధిదారులకు అందజేశారు.నాగలూటీ గ్రామానికి చెందిన శశికళ రూ, 1,50,000 , మిడుతూరు కు చెందిన రోశయ్య కు రూ, 1,10,000 .నందికొట్కూరు పట్టణానికి చెందిన లక్ష్మీ దేవి కి రూ, 1,10,000.ముసలమడుగు లక్ష్మీ దేవమ్మ కు రూ, 55,000.మంజూరు కావడంతో వాటిని ఎమ్మెల్యే ఆర్థర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బానీ,18వ వార్డ్ కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి,2వ వార్డ్ కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ తదిరులు పాల్గొన్నారు.

About Author