PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్నేహితుడి కుటుంబానికి అండగా..

1 min read

– పూర్వపు విద్యార్థుల ఆర్థిక సాయం
పల్లెవెలుగు వెబ్​, జోగులాంబ గద్వాల: స్నేహితుడు 40 రోజుల క్రితం హార్ట్​ స్ర్టోక్​తో మృతి చెందడంతో… ఆ కుటుంబానికి అండగా నిలిచారు పూర్వపు విద్యార్థులు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూర్​ గ్రామానికి చెందిన ఎండి ఖాజా హుసేన్​ 40 రోజుల క్రితం గుండె నొప్పితో మృతి చెందాడు. 1998–99వ బ్యాచ్​ రవీంద్ర హై స్కూల్​ పదో తరగతి బ్యాచ్​ విద్యార్థులు స్నేహితుడు ఎండి ఖాజా హుసేన్​ మృతి చెందిన విషయం తెలుసుకుని.. రూ.63,500లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆ మొత్తాన్ని ఖాజా హుసేన్​ భార్య సైనజ్​ బేగంకు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ… ఆర్థిక సాయం చేయడం గొప్పవిషయమని పూర్వపు విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు.

About Author