PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

1 min read

పల్లెవెలుగువెబ్​, వేంపల్లె : వేంపల్లి పట్టణంలోనీ పలు ప్రాంతాల్లోని పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వైఎస్సార్‌సీపీ యువ నాయకులు ఎస్ డి సమీర్ . శనివారం కోవిడ్ – 19 సెకండ్ వేవ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ దాదాపు 350 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, పంచదార, నూనె, ఉప్పు, కారం పొడి తదితర నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేశారు . పేదలను ఆదుకునేందుకు వేంపల్లె మండలం మాజీ జడ్పీటీసీ షబ్బీర్ వలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన లిమ్రా వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో లిమ్రా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు షమ్మ , ముస్తాక్, మదార్ షా వలి, నాయబ్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

About Author