PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ తోఫా పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిట్వేల్​: పవిత్ర రంజాన్​ పండగను ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా.. సమానంగా జరుపుకోవాలని చిట్వేల్​ ముస్లిం వెల్ఫేర్​ సొసైటీ అధ్యక్షులు షేక్​ ఖదీర్​ బాషా ఆకాంక్షించారు. సోమవారం పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 70 మందికి రంజాన్​ తోఫా పంపిణీ చేశారు. నిరుపేదల ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల సన్నబియ్యం, కేజీ కందిపపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ సెమియా, కేజీ చక్కెర, లీటరు వంటనూనెతోపాటు రూ. 300 నగదును కరోనా నిబంధనలను పాటిస్తూ అందజేశామన్నారు. ఈ సందర్భంగా షేక్​ ఖదీర్​ బాష మాట్లాడుతూ రంజాన్​ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. స్థానిక ముస్లింలతోపాటు కువైట్ ప్రవాస ముస్లింలు, యువకులు తోఫా పంపిణీకి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. అనంతరం సొసైటీ ఉపాధ్యక్షులు ఎస్​ఎస్​ షఫీ , కార్యదర్శి షేక్​ జిలాని బాష మాట్లాడారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి షేక్.ఇంతియాజ్ అహ్మద్, కోశాధికారి జి.ఎస్.అల్లభక్ష్, సభ్యులు అంజాద్ భాషా, ఖాలేశా, మస్తాన్, షబ్బీర్, రియాజ్ ఖాన్, సానవాజ్,ముస్లింపెద్దలు, యువకులు పాల్గొన్నారు.

About Author