PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: మండల పరిధిలోని హరినగరం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆ గ్రామ వైసీపీ నాయకుడు నాగముని శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత నాడు నేడు పథకం కింద పాఠశాలకు రూ. 20 లక్షల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. ప్రధానంగా బాలికల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు మరుగుదొడ్లు నిర్మించేందుకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని దీంతో బాలికలకు ఇబ్బందులు తొలిగినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ అంజలి వైస్ చైర్మన్ సత్యానందం ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి సిఆర్పి రహంతుల్లా ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author