ఇప్పటం బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష
1 min read

పల్లెవెలుగువెబ్ : ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను జనసేన తరఫున ఆదుకుంటామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంగళవారం వెల్లడించారు. ఈమేరకు ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం వివరాలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలిపారు.