PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆగి ఉన్న ట్రాలీని ఢీకొన్న స్కూటీ

1 min read

పల్లెవెలుగు,వెబ్ మిడుతూరు: రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని స్కూటీ ఢీకొన్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని వీపనగండ్ల బాట దగ్గర రహదారి పక్కన ట్రాక్టర్ పంచర్ కావడంతో ట్రాలీని పక్కన పెట్టారు.పగిడాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన హనుమన్న,వెంకటేశ్వర్లు అను వీరిద్దరూ రోళ్ల పాడు గ్రామంలో మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు.రోళ్లపాడు గ్రామంలో ఉన్న పొలంలో పనులు ముగించుకొని రాత్రి స్కూటీ పైన హనుమన్న,వెంకటేశ్వర్లు వీరిద్దరూ వెళ్తూ ఉండగా వీపనగండ్ల బాట దగ్గర ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో వీరిద్దరికి గాయాలు అయ్యాయి.స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

About Author