PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు

1 min read

పల్లెవెలుగు , వెబ్ విజయవాడ: స్థానిక న్యూ రాజరాజేశ్వరి పేటలో జరిగిన సంఘటన చాలా సిగ్గు తో కూడిన సంఘటన అని టిడీపి స్టేట్మహిళఉపాధ్యక్షురాలు షేక్ ఆషా తీవ్రంగా విమర్శించారు. స్థానిక మొగల్రాజపురం లోని కేశినేనిశివనాథ్ (చిన్ని) కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జరిగిన అఘాయిత్యానికి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదని ప్రభుత్వ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నుండి ఎటువంటి స్పందన లేదని తీవ్రంగావిమర్శించారు. మేము బాధితురాలు నీ పరామర్శించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చారని అప్పటివరకు ఎవరు రాలేదనిఆమె అన్నారు. బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి భరోసా ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షురాలు కార్పొరేటర్ టిడీపి చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా విచారకరమని మేము హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఆ బాలికను చూసి కన్నీరు మున్నీరయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో బాలికలకు మహిళలకు రక్షణ లేకుండా ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో టిడీపి తెలుగు మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author