PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ.. అసమర్థ పాలన..!

1 min read

– ఆక్సిజన్​ అందక సంభవించిన మరణాలు.. ప్రభుత్వ హత్యలే
పల్లెవెలుగు వెబ్​, కడప : రాష్ట్రంలో కోవిడ్​ బాధితులు పిట్టల్లా రాలిపోతుంటే… సీఎం వైఎస్​ జగన్​ రెడ్డి నియంత్రించలేకపోతున్నారని, ఆక్సిజన్​ అందక చనిపోయిన కోవిడ్​ మృతులన్నీ… ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు టీడీపీ కడప నియోజకవర్గ బాధ్యులు వీఎస్​ అమీర్​బాబు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆక్సిజన్​ అందక మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని బుధవారం రాత్రి తన నివాసంలో క్యాండిల్​ వెలిగించి అశ్రు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీఎస్​ అమీర్​బాబు మాట్లాడుతూ సీఎం జగన్​ రెడ్డి మూర్ఱత్వంతోనే కోవిడ్​ బాధితులు ఆక్సిజన్​ అందక మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆక్సిజన్​ అందక 76 మది మృతి చెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు.

About Author