PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూ. ఇవ్వాలి

1 min read

– మహా ధర్నా వాల్ పోస్టర్లు విడుదల చేస్తున్న సిపిఐ నాయకులు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య సిపిఐ మండల కార్యదర్శి డి . రాజా సాహెబ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో మహాధర్నా వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చడం జరిగిందన్నారు. జగనన్న ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే 1,80,000 ఏమాత్రం సరిపోవని, ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పోరుబాట చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా ఈనెల 17 నుండి 30వ తేదీ వరకు సంతకాల సేకరణ, 30న లబ్ధిదారులతో కలిసి మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి,ఫిబ్రవరి 6న కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాలు, ఫిబ్రవరి 22న విజయవాడలో మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు గురుదాస్, కారుమంచి, కారన్న, పెద్ద ఈరన్న, సురేంద్ర కుమార్, నెట్టికంటయ్య, మాదన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author