PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివ స్వాములకు బిక్ష పెట్టడం గొప్ప విషయం – టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని పాతబస్టాండులో ఉన్న శ్రీశైలం దేవస్థానంలో శివ స్వాముల అన్నదాన కార్యక్రమంలో కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ స్వాములకు బిక్ష వడ్డించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా శివ స్వాములకు బిక్ష పెట్టడం గొప్ప విషయమన్నారు. తమ టీజీవి సంస్థల తరుపున కూడా శివ స్వాముల అన్నదానం కోసం 20 రోజులకు సరిపడా బియ్యంతో పాటు ఇతర సరుకులను అందజేస్తున్నట్లు భరత్ తెలిపారు. రూ. 40 వేలు విలువైన బియ్యం అన్నదానం కోసం విరాళం ఇచ్చిన టిజి భరత్ కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author