PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం కర్నూలు నగరంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశము జరిగినది.. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అయినటువంటి శ్రీ ఆర్ మణి నాయుడు గారు, ఏపీ స్టేట్ కన్వీనర్ శ్రీ వరప్రసాద్ గారు, ఏపీ స్టేట్ ఆర్గనైజింగ్ ఉపాధ్యక్షులు శ్రీ RK పట్టెం రాజు రాజు గారు, ఈ జోన్ కోఆర్డినేటర్ జయ కుమార్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీ ఆర్ మణి నాయుడు గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్ధానాలలో పోటీ చేస్తుందని, కార్యకర్తలు కష్టపడి పార్టీని బలోపేతం చేసి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో B.V.సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు ఆమ్ ఆద్మీ పార్టీలో పార్టీలో చేరారు .ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మహమ్మద్ రఫీక్ గారు, రాయలసీమ జోన్ కో కన్వీనర్ BV సుబ్బారెడ్డి గారు, కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి మహమ్మద్ అక్బర్ హుస్సేన్ గారు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు, సిటీ కన్వీనర్ షకిల్ ఖాన్ గారు, స్టూడెంట్ వింగ్ లీడర్ అబ్దుల్ రహీం గారు, చిత్తూరు జిల్లా కన్వీనర్ విరుపాక్షి నవీన్ రెడ్డి గారు, జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author