PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​’మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి

1 min read
మాట్లాడుతున్న అల్లాబకాష్​

మాట్లాడుతున్న అల్లాబకాష్​

– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జ్​ అల్లా బకాష్ (సిఎల్పీ)
పల్లెవెలుగు,రాయచోటి: కరోనా కష్టకాలంలో సొంత లాభం కొంత మానుకుని.. తమకు తోచిన సహాయ సహకారాలు పేదలకు చేయాలని కాంగ్రెస్ రాయచోటి ఇంచార్జ్ ఎస్ అల్లాబకాష్ (సీఎల్పీ) పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెకండ్​వేవ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్​ బారిన పడిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వారికి నిత్యావసర సరుకులు, శానిటైజర్​, మాస్కులు, అన్నదానం తదితర సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్​ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్​గ్రేషియాతోపాటు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విధంగా రేషన్​కార్డు ఉన్న రూ.5 వేలు ఇచ్చి ఆదుకోవాలని అల్లాబకాష్​ కోరారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు యహియ భాష, కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, షాజహాన్ బాషా, డీసీసీ కిసాన్ సెల్ చెన్నై కృష్ణ పాల్గొన్నారు.

About Author