PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం

1 min read

– 77వ రోజు శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వెలుగోడు పట్టణం గడపగడపకు మన ప్రభుత్వం
మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకుందాం
– గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: ప్రతి ఇంటికీ సంక్షేమ పథ కాలు అందించిన జగనన్నను వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు అన్నారు. సోమవారం సాయంత్రం వెలుగోడు నగరం లోని సచివాలయం 4 ,5 పరిధిలోని సిపి నగర్ ద్వారకా నగర్ లక్ష్మీ నగర్ గాంధీనగర్ , గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగత పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్ను లబ్ధిదారులకు అందజేశారు, రాజ్యాంగ స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్లు, మహిళా చట్టాలు, పేదలకు సంక్షేమ పథకాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అందరికీ అందుబాటులోకి విద్యా, వైద్యం తీసుకొచ్చిన ఘనత జగనన్నకే సాధ్యమైందన్నారు. వచ్చే ఎన్ని కల్లో సంక్షేమ, అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా జనం వారికి తగిన బుద్ధి చెబుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , వెలుగోడు మెజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్ గారు, వెలుగోడు మండలం ఎంపీపీ లాలం రమేష్, మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు, అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు , సచివాలయ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author