PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ పథకాలే ప్రజలు గుర్తించుకుంటారు : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలే ప్రజలు గుర్తించుకుంటున్నారని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు శనివారం ఎమ్మార్వో ఆఫీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లు గృహ సారధులతో సమావేశం నిర్వహించారు. కాటసాని తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తున్నారని తెలిపారు ప్రతి వాలంటరీ సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలా బాధ్యత తీసుకోవాలన్నారు గత ప్రభుత్వ పాలన ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రజలకు వివరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుండం నాగేశ్వర్ రెడ్డి డాక్టర్ మమ్ముద్ హుస్సేన్ అంబాటి రవి రెడ్డి సిద్ధం రామ్మోహన్ రెడ్డి అబ్దుల్ ఫైజ్. ఆరో వార్డు సురేష్ గౌండ కమగిరి బాల పకీర అనిల్ కుమార్ వైయస్సార్ సిపి నాయకులు సర్పంచులు జడ్పిటిసిలు కాటసానిఅభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author