NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

RRRకు వైద్య ప‌రీక్షలు పూర్తీ.. సీల్డ్ క‌వ‌ర్లో ఏముంది ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజుకు వైద్య ప‌రీక్షలు పూర్తయ్యాయి. ఈ మేర‌కు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఒక ప్రక‌ట‌న విడుదల చేసింది. ముగ్గురు వైద్యుల మెడిక‌ల్ బోర్డు ఆధ్వర్యంలో వైద్య ప‌రీక్షలు నిర్వహించిన‌ట్టు తెలిపింది. సుప్రీం ఆదేశాల‌తో తెలంగాణ హైకోర్టు న్యాయాధికారి స‌మ‌క్షంలో వైద్య ప‌రీక్షలు నిర్వహించారు. సుప్రీం కోర్టు నుంచి త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు ర‌ఘురామ‌రాజు ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండ‌నున్నారు. వైద్య ప‌రీక్షల‌ను వీడియో తీశారు. నివేదిక‌ను తెలంగాణ హైకోర్టు జ‌న‌ర‌ల్ కు పంపుతారు. తెలంగాణ హైకోర్టు సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వనుంది.

About Author