PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించండి

1 min read

– అభ్యర్థించిన మీసాల ప్రేమ్ కుమార్
పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: కోడుమూరులోని తహసిల్దార్ కార్యాలయం ,ఎం.డి.ఓ ఆఫీస్ ,పోలీస్ స్టేషన్ ,ఆర్ .అండ్ .బి, సచివాలయం మొదలగు ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలలో పర్యటించి ప్రతి ఒక్క అధికారిని విధిగా కలిసి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర గారికి తమరి అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసినదిగా అభ్యర్థించడం అయినది ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు చేసిన అభివృద్ధి పనులు కేటాయించిన నిధులు ..త్రిబుల్ ఐటీ కాలేజ్ ,జాతీయ రహదారులు ,సోలార్ ప్లాంట్ ,కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 కోట్లతో క్యాన్సర్ కు అధునాతన పరికరాలు DRDO వంటి అనేక కేటాయింపుల గురించి వివరించడం అయినది రాష్ట్రంలో అమలయ్యే అన్ని పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా 60 నుండి 80% కేంద్రానిదేనని తెలపడం అయినదిఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సల్వాది సురేంద్ర ,జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మద్దిలేటి ,మరియు కర్నూలు మండల అధ్యక్షులు బెస్త ఈరన్న , ప్రధాన కార్యదర్శి సద్దల మధు కిషోర్ ,గూడూరు రూరల్ మండలం అధ్యక్షులు రాజశేఖర్ ,కర్నూలు రూరల్ మండలం కిసాన్ మోర్చా అధ్యక్షులు రామ కృష్ణ ,కోడుమూరు కిసాన్ మోర్చా అధ్యక్షులు కృష్ణ బిజెపి నాయకులు ముని ఆచారి ,నటరాజ్ , సుధాకర్ .. రైతులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author