NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరెంట్ స్తంభం విరిగిపడి ట్రాక్టర్లో ఉన్న సొప్ప మంటల్లో దగ్ధం

1 min read

– పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఏఈ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ట్రాక్టర్లో సొప్ప వేసుకొని వెళ్తుండగా కరెంట్ తీగలు పడి ట్రాక్టర్ లో ఉన్న సొప్ప మంటల్లో దగ్ధమైంది.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మిడుతూరు గ్రామానికి చెందిన బోయ హర్షవర్ధన్ కు చెందిన ట్రాక్టర్ మిడుతూరు నుండి కాజీపేటకు ట్రాక్టర్లో సొప్పను తీసుకువెళ్తుండగా మిడుతూరు ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ తగలడంతో కరెంట్ స్తంభం విరిగిపడి ట్రాక్టర్ పైన కరెంట్ తీగలు పడడంతో ట్రాక్టర్ పై ఉన్న సొప్ప అంటుకోవడంతో విపరీతంగా మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తమై పొలంలోకి తీసుకువెళ్లి సొప్ప బూడిద అయిన వాటిని కాలనీవాసులతో తొలగించారు.కరెంట్ స్తంభం విరిగి పడటం వలన స్తంభం విలువ 15 వేల రూపాయలు చేస్తుందని మండల విద్యుత్ శాఖ ఏఈ క్రాంతికుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

About Author