PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూ.ఎన్టీఆర్​ అభిమానుల.. సేవ

1 min read
మాస్క్​లు పంపిణీ చేస్తున్న బోయపాటి మధు

మాస్క్​లు పంపిణీ చేస్తున్న బోయపాటి మధు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్​) 39వ జన్మదిన వేడుకలను ఆయన అభిమాన సంఘం నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణ కొట్కూరులో జూ.ఎన్టీఆర్​ వీరాభిమాని సుధాకర్​ నేతృత్వంలో టైగర్​ టీం ఎన్టీఆర్​ మరియు ఎన్​కేఆర్​ అభిమాన సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు వెయ్యి మందికి మాస్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్​. అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత కేక్​ కట్​ చేసి అభిమానులకు, ప్రజలకు పంచారు.

About Author