PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం విజయం వైసీపీ పతనం

1 min read

– ఎమ్మెల్సీల విజయంతో వీరబల్లిలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణుల సంబరాలు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయంతో వైసిపి పతనం ఖాయమైందని తెలుగుదేశం పార్టీ వీరబల్లి మండల అధ్యక్షులు ఏం భానుగోపాల్ రాజు పేర్కొన్నారు.మండల కేంద్రంలో ఆదివారం అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి విజయోత్సవాలను జరుపుకున్నారు.సీనియర్ నాయకులు రెడ్డిప్ప రెడ్డి,సురేందర్ రెడ్డి ,శ్రీధర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ సంబరాలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంతో పట్టభద్రులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో అఖండ మెజార్టీని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.వీరబల్లి మండల కేంద్రంలో విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో కూడా మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.బాణాసంచా పేల్చి తెలుగు యువత కేరింతలు కొట్టారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయికులు నాగసుబ్బయ్యనాయిడు,జయచంద్రరెడ్డి,రామ్మోహన రెడ్డి, ప్రదాన కార్యదర్శి తోల్ల సురేంద్ర, రమణ నాయుడు,మండల ఉపాద్యక్షుడు దుర్గం ఆంజినేయిలు,మహిళ అద్యక్షురాలు నాగసుబ్బమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు,బాస్కర్ రాజు,రాజరాజు,ప్రసాద్ రాజు,ప్రభాకర్ నాయిడు,మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, జగిలి రామచంద్ర,తెలుగుయువత కార్యదర్శి నేతి రమేష్ ,రవిరాజు చలపతి,సిద్దిరాజు, బిసినాయికులు సుదాకర, రామక్రిష్ణ రాజు,తిమ్మయ్య, పవన్ కళ్యాణ్, వి. ఆంజినేయిలు ,డ్రైవర్ శివ ,వీరామృత నాయిడు, వినయ్, మహేష్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

About Author