PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి పట్టబద్రుల గుణపాఠం..!

1 min read

– ఎమ్మెల్సీ ఎన్నికలలో పనిచేయని ఓటుకు నోటు.
– పట్టబద్రులను మోసం చేసిన వైసీపీ నాయకులు..
– పట్టబద్రులకు డబ్బులు ఇవ్వలేదనే ఆరోపణలు.
– సచివాలయం సిబ్బంది ముంచేశారా..?
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పక్షిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి ఓటమికి వైసీపీ నాయకుల వెన్నుపోటే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికలలో వైసీపీ నాయకులు పట్టబద్రులకు డబ్బు పంపిణీ చేయకుండా నొక్కేశారని పట్టబద్రులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.దూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు డబ్భులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ప్రచారం సాగుతోంది. వైసీపీ పట్టబద్రుల ఎన్నికలలో వైసీపీ ఓటమి పై పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రయాలను వెలిబుచ్చారు..
సచివాలయం స్టాఫ్ ముంచేశారా..?
వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయిందా..?
పట్టభద్రుల నియోజకవర్గాలపై వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయింది. ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వాలంటీర్లలో ఉన్న పట్టభద్రులు.. ఇలా అందరూ వైసీపీకే ఓటు వేస్తారని ఆ పార్టీ భావించింది. అదే ధీమాతో అభ్యర్థులను బరిలో దించింది. కానీ సీన్ రివర్స్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు.. పోటీ జరిగిన మూడుచోట్లా టీడీపీ అభ్యర్థులే గెలిచారు. అధికార పార్టీ వైసీపీకి సవాల్ విసిరారు.ఏపీలో ఐదు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెండింట, టీడీపీ మూడుచోట్ల విజయం సాధించింది. క్లియర్ గా చెప్పాలంటే టీచర్ ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలో, పట్టభద్రుల స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఒకరకంగా టీచర్ ఎమ్మెల్సీలను గెలవడం వైసీపీ గొప్పతనం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ టీచర్లలో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని అధిగమించి వైసీపీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రైవేట్ టీచర్ల ఓట్లతోపాటు, ప్రభుత్వ టీచర్లలో కూడా కొంతమంది వైసీపీ అభ్యర్థులకు జై కొట్టడంతో ఫలితాలు అలా వచ్చాయని చర్చ జరుగుతోంది.ఇక పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులు మూడుచోట్లా ఓడిపోయారు. పశ్చిమ రాయలసీమలో హోరాహోరీ పోరు నడిచినా అంతిమ విజయం టీడీపీదే కావడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ రాయలసీమలో టీడీపీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
ఎక్కడ తేడా కొట్టింది..?
తాజాగా ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన వైసీపీ నేతలు కూడా లక్షా 30వేల సచివాలయ పోస్ట్ లు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. మరి 9 జిల్లాలో పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆ సచివాలయ ఉద్యోగులంతా ఎవరికి ఓటు వేశారు .. వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఎవరికి వేయించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 90వేలకు పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారి ఓట్లన్నీ వైసీపీకి పడితే గెలుపు ఖాయమైపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. అందుకే వైసీపీ ఓడిపోయిందనే ప్రచారం సాగుతోంది.
పీడీఎఫ్ ఓట్లు కీలకంగా మారిందా…
పట్టభద్రుల నియోజకవర్గాల పరిధి చిన్నది, వారి ఓటింగ్ ని అందరికీ ఆపాదించలేం. అందులోనూ అవి టీడీపీ ఓట్లు కావు, పీడీఎఫ్, ఇతరుల ఓట్లన్నీ టీడీపీకి పడ్డాయనేది వైసీపీ నేతల వాదన. మరి టీచర్ల నియోజకవర్గంలో దక్కిన విజయాన్ని వారు వైసీపీ విజయంగా ఎలా భావిస్తారు. అక్కడ దక్కిన విజయం ఇక్కడ లభించకపోవడానికి కారణాలేంటి అనే విషయాన్ని మాత్రం వైసీపీ చెప్పలేకపోతోంది. దీన్ని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతగా చూడటంలేదంటున్నారు నేతలు. కానీ ఒకేసారి లక్షా 30వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసి.. డీఎస్సీ పూర్తిగా లేకపోవడం, గ్రూప్స్ లో అరకొర పోస్ట్ లు భర్తీ చేయడం వంటివి.. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయని చెప్పొచ్చు. అందుకే పట్టభద్రుల నియోజకవర్గాల్లో వైసీపీ బోల్తా పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

About Author