PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీమంతం కార్యక్రమానికి ప్రముఖులు హాజరు

1 min read

– టిడిపి రాజంపేట సీనియర్ నేత, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు గారు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం మట్లి గ్రామం మట్లి వడ్డెపల్లె కు చెందిన రాపూరి నాగేంద్ర సతీమణి శృతి సీమంతం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరి నాగేంద్ర ఆహ్వానం మేరకు టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు గారు హాజరై నాగేంద్ర సతీమణి రాపూరి శృతిని దీవించి ఆశీర్వదించారు. ఈ సంధర్భంగా నాగేంద్ర తోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి జగన్ రాజు గారిని గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జగన్ రాజు గారు నాగేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి వీరబల్లి మండల అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, నేతి రమేష్ బాబు, రాపూరి శశికిరణ్, రాపూరి రెడ్డి శిరీష, రెడ్డి శైలజ, దేరంగుల స్వర్ణ భార్గవి, నరేంద్ర, సుధాకర్, శోభన్ కుమార్, మౌలాలి, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

About Author