PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్ననే మనందరి నమ్మకం : కౌన్సిలర్​

1 min read

– 26వ వార్డు లో “మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారని జగనన్న మనందరి భవిష్యత్ అని జగనన్ననే మనందరి నమ్మకమని 26వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ కౌన్సిలర్ మందడి వాణి రవింద్రా రెడ్డి లు వార్డు ప్రజలకు వివరించారు. బుధవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కౌన్సిలర్ మందడి వాణి రవీంద్రారెడ్డిల ఆధ్వర్యంలో “మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు పోరెడ్డి జగదీశ్వర రెడ్డి, పోరెడ్డి శివ శంకర్ రెడ్డి, గృహ సారథులు పావని, సిరిగిరి పద్మావతమ్మ, భాగ్యమ్మ, సిరిగిరి శేషశయనారెడ్డి, శాలి సాహెబ్ లు పాల్గొన్నారు.

About Author