NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడుమూరులో దాహార్తిని తీర్చండి -ఎమ్మెల్యేకు మైనారిటీ మహిళలు వినతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో గత రెండు వారాల నుంచి మైనారిటీ కాలనీలో నీళ్లు రాకపోవడం పట్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని మైనార్టీ కాలనీకి చెందిన మహిళలు నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ కు సమస్యను విన్నవించారు.బుధవారం ఉదయం మిడుతూరులో జరుగుతున్న గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటూ ఉండగా కడుమూరు నుండి 20 మంది మైనారిటీ మహిళలు ఎమ్మెల్యేను కలిశారు.మాకు రెండు రోజుల్లో రంజాన్ పండుగ ఉంది.నీళ్లు లేకపోతే మేము ఏవిధంగా పండుగ చేసుకోవాలి.మాకు వెంటనే ఈసమస్యను పరిష్కరించాలని లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళమని వారు మొండికేశారు.వెంటనే ఈరోజే అక్కడికి వెళ్లి నీళ్లు వచ్చే విధంగా చూడాలని ఎమ్మెల్యే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాద్ ను ఆదేశించారు.

About Author