PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పౌరులకు సకాలంలో సేవలందించాలి

1 min read

– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పౌరులకు సకాలంలో సేవలందించడమే లక్ష్యంగా సివిల్ సర్వెంట్లందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన పిలుపునిచ్చారు.16వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ నా రపు రెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ తో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు పౌరులకు సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకు పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో వారికి సకాలంలో సత్వర సేవలు అందించడం ద్వారా వారికి మేలు చేకూర్చాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.

About Author