PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మలేరియా, డెంగ్యూ జ్వరాలను పూర్తి స్థాయిలో నియంత్రించాలి

1 min read

– ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మలేరియా, డెంగ్యూ జ్వరాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన వైద్యాధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా లైన్ డిపార్ట్మెంట్ ల అధికారులతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రాణాంతకమైన వ్యాధులని, వీటిని అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం తో పాటు ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు కలుగచేసే దోమలు మంచి నీటిలో మాత్రమే గుడ్లు పెడతాయన్నారు..టైర్స్, కొబ్బరి చిప్పలు, వాడని ఎయిర్ కూలర్స్ లో నిలువ ఉన్న నీటిలో గుడ్లు పెట్టడం వల్ల ఈ వ్యాధులు వస్తాయని, కాబట్టి వీటిని ఇంటి పరిసరాల్లో లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.. ప్రతి శుక్రవారం నీటి నిల్వలను ఖాళీ చేసి, ఆరబెట్టి, నీటి నిల్వల మీద మూత ఉంచుకునే లా ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా లైన్ డిపార్ట్మెంట్ ల అధికారులను కలెక్టర్ ఆదేశించారు..ప్రస్తుతం వేసవి కాలం అయినా అక్కడక్కడ కేసులు ఉన్నాయని, వర్షాలు పడితే కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు..మునిసిపల్, పంచాయతీ రాజ్, ఐసీడీఎస్, విద్య, గ్రామీణ నీటి సరఫరా, సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.. వ్యాధుల నివారణపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ముద్రించిన కరపత్రాలను సచివాలయాలు,వాలంటీర్ లు, అంగన్వాడీ, ఆశా, గ్రామ,మండల స్థాయి అధికారుల ద్వారా ఇంటింటికీ చేర్చి పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో DM &HO డాక్టర్ రామగిడ్డయ్య, జిల్లా టీబి అధికారి డాక్టర్ భాస్కర్, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author