PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్లమ్మ జాతర జరపడంలేదు: ఎస్​ఐ

1 min read

పల్లెవెలుగువెబ్​, చెన్నూరు : కరోన కేసులు పెరుగుతుండటంతో మండలంలోని కే ఆర్​ కాలనీలో వెలిసిన ఎల్లమ్మ జాతరను ఈ ఏడాది నిలిపివేసినట్లు ఎస్​ఐ బీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఇందుకు మండల ప్రజలు, పెద్దలు సహకరించాలని ఆయన కోరారు. శుక్రవారం ఎస్​ఐ విలేకరులతో మాట్లాడుతూ అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని, మాస్క్​, శానిటైజర్​, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు అమలులో భాగంగా ఎల్లమ్మ జాతర నిలిపివేసినట్లు ఎస్​ఐ శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.

About Author