PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనింగ్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల : సోమవారం నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ లో భూగర్భ గనుల శాఖ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ప్రారంభించారు. నేటి నుండి జిల్లా మైనింగ్ కార్యాలయం గనుల లీజుదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. బనగానపల్లె, బేతెంచెర్ల, ప్యాపిలి, డోన్ మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల గనుల లీజుదారులందరూ జిల్లా మైనింగ్ కార్యాలయం నుండే అనుమతులు పొందాలిసి వుందన్నారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో నంద్యాల జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు భూగర్భ గనుల శాఖ డిడి రాజశేఖర్, నంద్యాల జిల్లా మైనింగ్ అధికారి రామచంద్ర, విజిలెన్స్ రాయల్టీ ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author