PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొండను తొలగించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటాం

1 min read

– మైనింగ్ శాఖ అధికారులు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలకేంద్రం లోని ఎస్ సి కాలనీలోని నరసప్ప కొండ ఏప్రిల్ నెలలో ఎండ దెబ్బకు పగిలిన విషయం తెలిసిందే ఈ కొండను తొలగించేందుకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం గోనెగండ్ల మండల తహసిల్దార్ వేణుగోపాల్ తో పాటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డి ఈ శివరుద్ర, మైనింగ్ శాఖ జిల్లా అధికారులు అనుపమ, రాజశఖర్ లు కొండను సందర్శించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కొండను పూర్తిగా పగల కొట్టడానికి, కానీ కూల్చడానికి రాదు అని చుట్టూ ఇండ్లు ఉన్నందున వాటికి అపాయం జరగకుండా తొలగించేందుకు ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేయాలా లేదా అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి కొండను తొలగించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author