PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు

1 min read

–గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

– మేనిఫెస్టోలో ఇచ్చిన కన్నా ఎక్కువ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం మన వైస్సార్సీపీ ప్రభుత్వం

– ప్రతి గడపకు అందుతున్న పథకాలు

– కరోనా సమయంలో కూడా ఆగని పథకాలు

– దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు

– కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం ఉదయం కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం 5వ వార్డ్ 14వ సచివాలయం పరిధిలో ఉన్న చిత్తర్ వీధుల్లో నిర్వహించారు. పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. స్థానిక 5వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డ్ నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కుమారి విధిలో ఉన్న ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ గారు, 5వ వార్డ్ కార్పొరేటర్ జి.యల్.వి సుజాత  పార్టీ ముఖ్యనాయకులు జి.యల్.వి శేషు యాదవ్ ,అక్బర్ అలీ గ, మెహబూబ్ బాషా , ఖాదర్  మాక్సూద్ ,అబ్దుల్లా గారు,మొయిద్ ,జెట్టి యాదవ్ , వెంకీ యాదవ్ గారు,యుగేందర్ గారు,  శ్రీనివాసులు ,మళ్ళీ  , ఫాతిమా , అమ్రీన్ , శ్రీదేవి ,ఆచారి ,సత్యమయ్య , రాజు , ఆరిఫ్ ,శారదా , శకుంతల ,కన్వీనర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author